టాంటన్ : ప్రపంచ కప్పులో భారత జట్టుతో ఆడడం ఒత్తిడితో కూడుకున్నదని పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హఖ్ అంగీకరించాడు. సెమీస్ దాకా ఉండాలంటే భారత్తో ఆదివారం జరిగే మ్యాచులో తాము తప్పక గెలవాల్సిఉంటుందని అన్నాడు. ఇప్పటికే వర్షం వల్ల తాము ఓ మ్యాచ్ను కోల్పోయి, ఒక పాయింట్నూ నష్టపోయామని తెలిపాడు. అందువల్ల ఇండియాతో మ్యాచ్ తమకు కీలకంగా మారిందన్నాడు. ఇక ప్రతి మ్యాచూ తమకు కీలకమన్నాడు. కనుక భారత్తో ఆడేటప్పుడు ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. భారత్తో మ్యాచ్ అంటే ఒత్తిడి వెనుక ఎన్నో రహస్యాలు ఉంటాయని చెప్పాడు.