అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై రహస్య విచారణ (ఇన్కెమెరా)కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆయన భద్రత పునరుద్ధరణపై బుధవారం విచారణ జరిగింది. ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ను అడ్వకేట్ జనరల్ (ఏజీ) దాఖలు చేశారు. వాదనలు బహిరంగంగా కాకుండా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్గా జరపాలని కోరారు. ప్రతిపక్ష నేతకు సంబంధించిన భద్రతా వివరాలు బహిర్గతపరచలేమని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో భద్రతపై ఉన్నతాధికారి వివరణ ఇస్తారని పేర్కొన్నారు. దీనికి ఉన్నత న్యాయ స్థానం అనుమతినిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.