యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ

లక్నో: రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకుగాను 15 స్థానాలను మాత్రమే కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఎస్పీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తమ నిర్ణయాన్ని తెలియచేసినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఒక రాయ్బరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథీలో ఓటమి ఎదురైంది. ప్రస్తుతం బంతి కాంగ్రెస్ కోర్టులోనే ఉంది. దీంతో ఎస్పీ ఆఫర్పై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తమ ఆఫర్కు కాంగ్రెస్ పార్టీ అంగీకరించక పోతే సమాజ్వాదీ పార్టీ కూడా ఇండియా కూటమి నుంచే వైదొలిగే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 21 నుంచి 22 సీట్లు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ముస్లిం మైనారిటీ నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం.

తాజా సమాచారం