న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ నవంబర్ 30న – భారత్ బచావో పేరిట ఇక్కడ భారీ ఆందో ళన చేపట్టనుంది. దేశ ఆర్థిక స్థితి పతనం, నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగానికి గల కారణాల గురించి ప్రజలకు కేంద్రం బదు లివ్వకుండా దేశ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. న్యూ ఢిల్లీ కంటే ముందు అన్ని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేయాలని పార్టీ అధిష్ఠానం పిలుపు నిచ్చింది.