తెదేపా నేత అక్రమ కట్టడం కూల్చివేత

తెదేపా నేత అక్రమ కట్టడం  కూల్చివేత

విశాఖపట్నం : విశాఖ పట్టణం తెదేపా మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్ కు చెందిన బహుళ అంతస్థుల భవనాన్ని జీవీఎంసీ అధికారులు శని వారం కూల్చి వేసారు. ఇక్కడి ద్వారకానగర్ మెయిన్ రోడ్డులో సరైన అనుమతులు లేకుండా మురుగు నీటి కాల్వను డ్రైన్ ఆక్రమించి భవనాన్ని నిర్మించినట్లు అధికార్లు గుర్తించారు. దీనిపై గతంలో పలు మార్లు తాఖీదులు జారీ చేసినా స్పందన కరువైందని అధికార్లు తెలిపారు. దరిమిలా ప్రత్య క్షంగా రంగంలోకి దిగి కూల్చి వేసారు. దీంతో పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి గొడవలు భారీగా పోలీసుల్ని మోహరించారు. గత కొన్ని రోజు లుగా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలను అధి కారులు కూల్చేస్తున్న విషయం విదితమే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos