అక్రమ కట్టడాలన్నీ కూల్చి వేస్తాం

అక్రమ కట్టడాలన్నీ కూల్చి వేస్తాం

అమరావతి: ప్రజా వేదిక కూల్చివేతను ప్రజలంతా హర్షి స్తున్నారని మంగళ గిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రు. ప్రజావేదిక కూల్చివేత పనులను బుధవారం ఉదయం పరిశీలించిన తర్వాత విలేఖరులతో మాట్లాడారు. కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన 60కి పైగా ఖరీదైన భవనాల యజమానులకు తాఖీదుల్ని జారీ చేయించినట్లు తెలిపారు. సంబంధిత వ్యాజ్యాలు ఈ నెల 21న న్యాయ స్థానం విచారణకు చంద్రబాబు వ్యవస్థల్ని నియంత్రించారని ఆరోపించారు. ప్రజా వేదిక పక్కన ఉన్న అక్రమ నిర్మాణంలో చంద్ర బాబు నివశించటం అన్యాయమైనందున తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును తాను వదిలి పెట్టబోనని తేల్చి చెప్పారు. ‘మిగిలిన వాళ్లు తామంతట తాము ఖాళీ చేస్తే మంచిది. జగన్కి ఉన్న మంచి మనసును అంతా గుర్తించాల’ని విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos