‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు ఆటగాళ్లు క్రీజు వదలొద్దు’ అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి వన్డేలో ధోనీ మరోసారి తన సమయస్ఫూర్తిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. నీషమ్ బంతిని ఆడేందుకు ముందు రాగా అది కాళ్లకు తగిలి వికెట్ల వెనక్కి వెళ్లింది. దీంతో ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. వెంటనే తేరుకున్న నీషమ్ వెనక్కి వెళ్లేలోపు ధోనీ రెప్పపాటు వేగంతో వికెట్లను గిరాటేసి పెవిలియన్కు పంపాడు. దీంతో నీషమ్ ఆశ్యర్యపోతూ.. పిచ్ను వదిలాడు. ఆ రనౌటే మ్యాచ్ను కీలక మలుపు తిప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీన్ని ఉద్దేశిస్తూ.. ఓ క్రీడాభిమాని చేసిన ట్వీట్కు ఐసీసీ స్పందిస్తూ.. ‘‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు మీరు క్రీజును వదలొద్దు’’ అంటూ ట్వీట్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో భారత్ 4-1తో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరగనుంది.