ప్రేమించి పెళ్లి చేసుకున్న యువజంటపై యువతి కుటుంబ సభ్యులు హత్యా యత్నం చేసిన ఘటనకు సంబంధించి ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆరు మంది నిందితులను అరెస్ట్ చేశారు.విచారణలో నిందితులు వెల్లడించిన సమాచారం ప్రకారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.‘ఇంటికి వచ్చిన ప్రతిసారీ ప్రేమగా… చెల్లి, చెల్లి అని పిలిచేవాడు.పైగా సమీప బంధువే కావడంతో ఇంతియాజ్ను ఇంట్లోకి రానిచ్చి పూర్తగా నమ్మాం.అటువంటిది ఒక్కసారిగా ఇంట్లో నుంచి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అందుకే అతనిని చంపాలనుకున్నాం’ అని నిందితులు తెలిపారు.ఘనట పూర్వపరాలు పరిశీలిస్తే సంగారెడ్డి సమీపంలోని శాంతినగర్కు చెందిన షేక్ ఇంతియాజ్(21) నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. బోరబండలో నివసిస్తున్న బంధువు సయ్యద్ ఆలీ ఇంటికి తరచూ వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో సయ్యద్ కుమార్తె జైనా ఫాతిమా(19)తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయం ఇరు కుటుంబాలకు తెలిసినప్పటికీ అమ్మాయి తరఫు వారు వివాహానికి అంగీకరించలేదు. దీంతో వారు రంజాన్ రోజున సదాశివపేటలోని ఓ దర్గా సమీపంలో ఒక్కటయ్యారు.ఈ క్రమంలో కుమార్తె కనిపించడం లేదంటూ రెండు రోజుల కిందట యువతి తండ్రి ఆలీ ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంగారెడ్డి వెళ్లి అక్కడి పోలీసులను కూడా సంప్రదించాడు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో.. కూతురు, అల్లుడిని ఏమీ చేయనని హామీ ఇచ్చాడు. వారిని ప్రేమగా చూసుకుంటామని మాయమాటలు చెప్పి అమీర్పేటకు తీసుకువచ్చాడు.అయితే ఇంతియాజ్పై కోపంతో రగిలిపోతున్న ఫాతిమా సోదరుడు ఫారుఖ్ తనకు పరిచయమున్న పాత కిరాయి హంతకులు రబ్బాని,షకీల్ సహాయంతో మారణాయుధాలతో దాడి చేసి పారిపోయారు.దాడిలో ఫాతిమ తల్లితండ్రులు కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ దాడిలో ఇంతియాజ్ తీవ్రంగా గాయపడగా.. ఫాతిమాకి స్వల్పంగా గాయాలయ్యాయి.ఈ కేసులో నిందితులు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెల్లి అని పిలుస్తూ ఇలా చేస్తాడని తాము అనుకోలేదని, తమ పరువు అంతా పోయిందని నిందుతులు చెప్పారు. ఫాతిమా కి కొంత కాలం క్రితం వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించామని.. ఇంతలోనే ఇంతియాజ్ ఇలా చేశాడని వారు చెప్పారు. తన స్నేహితుల సహాయంతో ఇంతియాజ్ పై దాడి చేసినట్లు ఫాతిమా సోదరుడు అంగీకరించాడు.కాగా దాడిలో పాలుపంచుకున్న పాత కిరాయి నేరస్థులు రబ్బానీ, షకీల్ పరారీలో ఉన్నారు.