అమ్మ…అకౌంటెంటా..!

అమ్మ…అకౌంటెంటా..!

అనంతపురం : జిల్లా ట్రెజరీలో పనిచేసే అకౌంటెంట్ మనోజ్ కారు డ్రైవర్ నాగలింగ ఇంట్లో భారీగా బంగారం, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముగ్గురు డిఎస్పిలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు చేశారు. ఉద్యోగి ఆస్తులపై ఆరా తీస్తే పోలీసులకు దిమ్మ తిరిగింది. ఎనిమిది ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదును గుర్తించారు. అలాగే

మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నట్లు తేలింది. ఉద్యోగి మనోజ్ ఇంట్లో ఎనిమిది పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షల నగదు, రూ.27 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.49 లక్షల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. ఆరు బైక్లు, మూడు రాయల్ ఎన్‌ఫీల్డ్‌  బులెట్లు, రూ.లక్షల విలువైన మరో ద్విచక్ర వాహనం, నాలుగు ట్రాక్టర్లు, రెండు అత్యాధునిక

కార్లను గుర్తించారు. స్థిరాస్తులపై అనంతపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రెజరీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగి మనోజ్ దగ్గర నాగలింగ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుక్కరాయసముద్రంలోని అతడి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. 10 పురాతన ట్రంకు పెట్టెలు బయటపడ్డాయి. ఓ రివాల్వర్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఉద్యోగి మనోజ్‌తో పాటు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos