కన్నడ రాకింగ్స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 ఎన్నిసంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఐదు భాషల్లో విడుదలైన మొదటి కన్నడ చిత్రంగా,రూ.100,200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన మొదటి కన్నడ చిత్రంగా కూడా కేజీఎఫ్ చాప్టర్ 1 రికార్డులు నెలకొల్పింది.కన్నడతో పాటు తెలుగు, హిందీ,తమిళ భాషల్లో కూడా కేజీఎఫ్ మొదటి భాగం విజయం సాధించడంతో రెండవ పార్ట్పై నిర్మాతలు మరింత ప్రత్యేక దృష్టి సారించారు.మొదటి భాగంకంటే మూడు నాలుగు రెట్లు అధిక బడ్జెట్తో అన్ని చిత్రరంగాల నుంచి ప్రముఖ నటీనటులను కేజీఎఫ్ రెండవ భాగంలో తీసుకోవడానికి యత్నిస్తున్నారు. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ బుధవారం బెంగళూరు నగరంలోని కంఠీరవ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.చాప్టర్ 1 కు సమర్పకుడిగా వ్యవహరించిన అలనాటీ సీనయర్ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు కైకాల రామారావు పార్ట్ 2కు ఎగ్జిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు షాట్ ప్రారంభోత్సవంలో కైకాల రామారావు సహా చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రాకింగ్ స్టార్ యశ్ కథానాయిక శ్రీనిధి శెట్టి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే ఈ సినిమాను ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్టోబర్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబర్ నుంచి సీజీ వర్క్ సహా నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తారు. 2020 వేసవి కానుకగా సినిమా రిలీజవుతుంది.వచ్చే వేసవిలో విడుదల కానున్న కేజీఎఫ్ చాప్టర్ 2 ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి..