పీఎఫ్ఐ నాయకుల అరెస్టులకు నిరసనగా హర్తాళ్

పీఎఫ్ఐ నాయకుల అరెస్టులకు నిరసనగా హర్తాళ్

తిరువనంత పురం : పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర నేతలను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ మద్దతు దారులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హర్తాళ్ చేపట్టారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తిరువనంతపురంలో ఆటో, కారుపై ఆందోళనకారులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆ వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొల్లాంలో ఇద్దరు పీఎఫ్ఐ కార్యకర్తలు బైక్పై వచ్చి ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హర్తాళ్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయించినట్లు ఆందోళన కారులు తెలిపారు. కేరళ ఆర్టీసీ బస్సులను కట్టక్కాడ వద్ద నిలిపివేశారు. కేరళ, కన్నూర్, కాలికట్, ఎంజీ యూనివర్సిటీలు ఈ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. తిరువనంతపురం, కొల్లాం, కోజికోడ్, వయనాడ్, అలప్పుజ సహా పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కన్నూర్లోని నారాయణ్పరా వద్ద ఉదయం వార్తాపత్రికలను పంపిణీ చేయడానికి వెళ్తున్న వాహనంపై ఆందోళకారులు పెట్రోల్ బాంబు విసిరినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కోజీకోడ్లో 15 ఏళ్ల బాలికకు, కన్నూర్లో ఓ ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. గురువారం ఎన్ఐఏ అరెస్టు చేసిన వారిలో పీఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ బషీర్, జాతీయ ఛైర్మన్ సలాం, జాతీయ కార్యదర్శి నసరుద్దీన్ ఎలమారం, మాజీ ఛైర్మన్ అబూబాకర్ తదితరులున్నారు. పీఎఫ్ఐ హర్తాళ్ను కేరళ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆందోళనల్లో హింసలు చెలరేగటం దీనికి కారణం. ‘గతంలోనే హర్తాళ్ను నిషేధించామని, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని అంగీకరించలేం. కోర్టు ఆదేశాలను ఉల్లం ఘించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. హింసను అరి క ట్టేందుకు సాధ్యమైన మార్గాలను చూడాల’ని ప్రభుత్వాన్ని కోరింది. కోయంబ త్తూరు లోని భాజపా కార్యాలయంపై గురువారం రాత్రి కొందరు దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. దీంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos