ఉలవపాడు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్లే రామాయ పట్నం రేవు నిర్మాణాలు ఆరంభం కాలేదని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్.నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం రేవు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ‘ రామాయ పట్నం ప్రతిపాదనలు పంపకుండా ఐదేళ్లు కాలయాపన చేశారు. చంద్రబాబు సొంత ప్రయోజనాలు నెరవేరక పోవటమే ఇందుకు కారణం. రామాయ పట్నం, కనిగిరిలను నిర్లక్ష్యం చేసారు. చంద్ర బాబు అనూయాయులు ఇక్కడ భూములు కొనడమే అసలు రహస్యమ’ని విపులీకరించారు.