బాబు వల్లే రేవు ఆగింది

బాబు వల్లే రేవు ఆగింది

ఉలవపాడు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్లే రామాయ పట్నం రేవు నిర్మాణాలు ఆరంభం కాలేదని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్.నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం రేవు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ‘ రామాయ పట్నం ప్రతిపాదనలు పంపకుండా ఐదేళ్లు కాలయాపన చేశారు. చంద్రబాబు సొంత ప్రయోజనాలు నెరవేరక పోవటమే ఇందుకు కారణం. రామాయ పట్నం, కనిగిరిలను నిర్లక్ష్యం చేసారు. చంద్ర బాబు అనూయాయులు ఇక్కడ భూములు కొనడమే అసలు రహస్యమ’ని విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos