ముంబై : కొత్త సంవత్సరం స్టాక్ మార్కెట్లు లాభాలతో వ్యాపారాన్ని ఆరంభించాయి. ఉదయం 9.52 గంటలకు బాంబే స్టాక్ ఎ క్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 41,343 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి 12,194 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.20గా దాఖలైంది.భారతీ ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, లార్సెన్, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్ని గడించాయి. ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, ఎమ్అండ్ఎమ్, ఎన్టీపీసీ, సిప్లా కంపెనీల షేర్లు నష్ట పోయాయి.