సింగపూర్ నుంచి వెళ్లిపోవాలని గొటబాయకు హెచ్చరిక

సింగపూర్ నుంచి వెళ్లిపోవాలని గొటబాయకు  హెచ్చరిక

సింగపూర్ : శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇరకాటంలో పడ్డారు. రెండు వారాలల్లోగా దేశం విడచి వెళ్లాలని ఇక్కడ ప్రభుత్వం ఆయన్ను హెచ్చరించింది. శ్రీలంక ప్రజాగ్రహానికి భయపడిన ఆయన కుటుంబ సభ్యులతో కలసి గత బుధవారం మాల్దీవుల మీదుగా సింగపూర్ చేరారు. సింగపూర్ నుంచి ఈ మెయిల్ ద్వారా రాజీ నామాను శ్రీలంక స్పీకర్ కు పంపించారు. దీన్ని ఆమోదించడంతో ఆయన ఇప్పుడు మాజీ అధ్యక్షుడు అయ్యారు. ఈ క్రమంలో గొటబాయకు ఎక్కువ రోజులు ఆశ్రయం ఇచ్చేందుకు సింగపూర్ సుముఖంగా లేదు. సింగపూర్ లో ఉండేందుకు ఇచ్చిన 15 రోజుల సమయాన్ని పొడిగించే అవకాశం లేదని, మరో మార్గం చూసుకోవాలని రాజపక్సకు సింగపూర్ అధికారులు స్పష్టం చేసారు. 15 రోజుల తాత్కాలిక ఆశ్రయం తర్వాత ఏమి చేయాలో గొటబాయకు పాలు పోవటం లేదని తెలిసింది. ఆశ్రయం కోసం ఆయన భారత్ ను సైతం సంప్రదించినట్టు విశ్వసనీయ వర్గాల కథనం. దీనికి వ్యతిరేక స్పందన లభించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos