బంగారం, వెండి నేల చూపులు

  • In Money
  • January 10, 2020
  • 158 Views

హైదరాబాద్ : హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా పతనమైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.970 క్షీణించింది. దీంతో రూ.38,300కు దిగొచ్చింది. గురువారం బంగారం ధర రూ.39,270 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ఏకంగా రూ.1,070 పతనమైంది. దీంతో పసిడి ధర రూ.41,790కు క్షీణించింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.1500 కుప్పకూలింది. దీంతో ధర రూ.49,500కు దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos