న్యూ ఢిల్లీ:విపక్షాల నిరసన ధ్వనులు, ఎగతాళి కేకలు, అవహేళనల మధ్య గురువారం అత్యున్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణాన్ని చేసారు. ఆయన నిర్ణయాన్ని పలువురు న్యాయమూర్తులు, రాజకీయ విజ్ఞులు తప్పు బట్టారు.