పొత్తుపై జనసేన, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు

పొత్తుపై జనసేన, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు

హైదరాబాదు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు గురించి జనసేన, బీజేపీ నుంచి పరస్పర భిన్న ప్రకటనలు రావడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో అయో మయం నెలకొంది. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చర్చిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ ను బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు కలవనున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ విలేఖరులతో మాట్లాడారు. ‘జీ హెచ్ఎం సీ ఎన్నికలకు సంబంధించి జనసేనతో ఎలాంటి పొత్తు లేద’ని స్పష్టం చేశారు. భాజపా అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి కూడా దీన్నే పునరు ద్ఘాటించారు. జనసేనతో పొత్తు విషయమై చర్చించడానికి ఇప్పటివరకు ఎలాంటి సమావేశానికీ అంగీకరించ లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos