ఆరెస్సెస్ ప్రధాని అబద్ధాలాడుతున్నారు

ఆరెస్సెస్ ప్రధాని అబద్ధాలాడుతున్నారు

న్యూఢిల్లీ: నిర్బంధ కేంద్రాల స్థాపించ లేదని ప్రధాని మోదీ పచ్చిఅబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అసోంలోని మతియాలో నిర్మిస్తున్న నిర్బంధ కేంద్రం వీడియోను గురువారం ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆరెస్సెస్ ప్రధాని భరత మాతను అవాస్తవాలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతామని కాంగ్రెస్ సహా విపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మోదీ ఢిల్లీ ర్యాలీలో ఆరోపించారు. దేశంలో అసలు నిర్బంధ కేంద్రాలే లేవని చెప్పారు. మతియా నిర్బంధ కేంద్రం దాదాపు పూర్తి కావచ్చిందని ఒక జాతీయ టీవీ చానెల్ పేర్కొంది. 3000 మందిని ఇక్కడ బంధించ వచ్చు. అంచనా వ్యయం రూ.46 కోట్లు. అసోం రాజధాని గువహటికి 129 కిమీ దూరంలో ఉంది. 28,800 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో కూడిన 15 భవనాలను నిర్మించారు. వీటిలో 13 భవనాలను పురుషులకు, రెండింటిని మహిళలకు కేటాయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos