లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిసాయి. రిజర్వ్ బ్యాంక్ కలిగించిన ఊరటతో ఫార్మ షేర్లు భారీగా లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఆయిల్ , ఐటీ రంగ లాభాలు మార్కెట్కు ఊతమిచ్చాయి. సెన్సెక్స్ 424 పాయింట్లు ఎగిసి48677 వద్ద, నిఫ్టీ 121పాయింట్ల లాభంతో 14617 వద్ద ముగిసాయి. తద్వారా సెన్సెక్స్ 48600 ఎగువన, నిఫ్టీ 14600 ఎగువన ముగియడం విశేషం . లుపిన్ 14 శాతం, 6 శాతం పుంజుకుని సన్ ఫార్మా టాప్ గెయినర్స్గా దాఖలైంది. అరబిందో, క్యాడిల్లా, యుపిఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో, భారతి ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఒఎన్జిసి, దివిస్ ల్యాబ్స్, టిసిఎస్, టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎస్బిఐ లైఫ్ ఎల్ అండ్డీ , ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos