దూసుకుపోయిన మార్కెట్లు

దూసుకుపోయిన మార్కెట్లు

ముంబై:స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్ని గడించాయి. ఆర్బీఐ ప్రకటించిన పరపతి విధాన ప్రకటన మదుపర్లకు ఉత్సాహాన్నిచ్చింది. సెన్సెక్స్ తొలిసారి 45 వేల సరిహద్దు దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ 447 పాయింట్లు లాభపడి 45,080కి, నిఫ్టీ 125 పాయింట్లు పుంజుకుని 13,259 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ (4.20%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.10%), సన్ ఫార్మా (3.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.85%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.77%)లాభాల్ని గడించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.86%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.34%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.17%), ఎన్టీపీసీ (-0.10%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos