మార్కెట్లకు భారీ లాభాలు

మార్కెట్లకు భారీ లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో దూసుకు పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 680 పాయింట్లు బలపడి జీవనకాల రికార్డు స్థాయి- 43,278కి , నిఫ్టీ 170 పాయింట్లు పుంజుకుని సరికొత్త గరిష్ఠ స్థాయి- 12,631కి ఎగబాకాయి. ఆర్థిక, చమురు, మౌలిక వసతుల కంపెనీల షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఐటీ, ఆటో షేర్లు కాస్త డీలా పడ్డాయి.బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్&టీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ షేర్లు లాభాల్ని గడించాయి. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్టెక్, ఇన్ఫోసిస్, నెస్లే, సన్ఫార్మా, టీసీఎస్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos