మంచిపని చేసే వ్యక్తులకు గౌరవం దక్కదు

మంచిపని చేసే వ్యక్తులకు గౌరవం దక్కదు

ముంబై: ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అభిప్రాయపడ్డారు. అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీతో అంటకాగాలని చూసే వారే అధికమని అన్నారు. సిద్ధాంతాల భూమిక లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. లోక్మత్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే.. మంచి పని చేసేవాడికి గౌరవం లభించదని, చెడ్డ పనిచేసే వారికి శిక్ష పడదని తానెప్పుడూ సరదాగా చెప్పేవాడినని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎవరిని ఉద్దేశించి ఇలా అన్నారో ఆ పేరు మాత్రం వెల్లడించలేదు.

తాజా సమాచారం