పేదలకు ఉచితంగా వంట సామాగ్రి పంపిణీ

హొసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వంట సామాగ్రి, వెయ్యి రూపాయలను వినియోదారులకు అందించారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. అందులో భాగంగా మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు సైతం మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా వంట సరుకుతో పాటు రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వినియోగదారులకు ఉచిత బియ్యం, గోధుమలు, వంట నూనె, చక్కెరతో పాటు వెయ్యి రూపాయలు అందజేశారు. బాగలూరులో పంచాయితీ అధ్యక్షుడు వీడీ. జయరాం అధ్యక్షతన వినియోగదారులకు వీటిని పంపిణీ చేశారు. రోజుకు వంద మందికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.బాగలూరులో జరిగిన రేషన్ సరుకుల వితరణ కార్యక్రమంలో బాగలూరు పంచాయతీ అధ్యక్షుడు జయరాంతో పాటు ఏడీఎంకె పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం