హోసూరు : కరోనా నియంత్రణకు అప్పావు పిళ్లై పొన్నమ్మాళ్ ట్రస్టు ద్వారా జాగిరుకోడిపల్లి గ్రామస్థులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.కృష్ణగిరి జిల్లా మధగొండపల్లి సమీపంలోని జాగిరుకోడిపల్లి గ్రామంలో అప్పావు పిళ్లై పొన్నమ్మాళ్ ట్రస్ట్ అధ్యక్షులు, ఐఎన్ టీయూసీ నాయకుడు కె.ఎ. మనోహరన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అయిదు వందల మందికి ఉచితంగా మాస్కులు, ఆయుర్వేద మాత్రలను పంపిణీ చేశారు. ఈ మాత్రల వాడకం వల్ల ఎటువంటి ఇబ్బంది కలుగబోదని, కరోనా నియంత్రణలో భాగంగా మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కె.ఎ. మనోహర న్ తెలిపారు. ఈ కార్యక్రమలో డాక్టర్ అమానుల్లా, డాక్టర్ సిరాజ్, ఐఎన్టీయూసీ నాయకులు మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.