నక్క జిత్తులు కరోనా

నక్క జిత్తులు కరోనా

న్యూ ఢిల్లీ: కరోనా పీడితుల రక్త నమూనాల్లో నెగటివ్ వచ్చిన ఎనిమిది రోజుల పాటు వైరస్ శరీరంలోనే తిష్ట వేస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్- తాజా సంచిక ప్రత్యేక కథనంలో బీజింగ్ లోని పీఎల్ఏ సార్వజనిక వైద్య శాలలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్య చికిత్స పొందిన 16 మంది పై పరిశోధనలు చేసి దీన్ని కనుగొన్నట్లు భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేశ్ శర్మ తెలిపారు. ‘వారి నుంచి రోజు విడిచి రోజు రక్త నమూనాలు సేకరించాం. చికిత్స తరువాత వైరస్ లేదని నిర్ధారణ అయిన వారిలో సగం మందిలో మరో ఎనిమిది రోజుల పాటు వైరస్ దాగుంద’ని తేలిందని వివరించారు. చికిత్స పొందిన వారు మరికొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంటేనే మంచిదని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos