రాజధాని సరిహద్దుల మూసివేత

రాజధాని సరిహద్దుల మూసివేత

న్యూ ఢిల్లీ:ఢిల్లీలో చెలరేగిన హింసను అణచివేతకు నగర సరిహద్దు ప్రాంతాలను కొంత కాలం మూసి వేయనున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం అదనపు బలగాలను మోహరించనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంగళవారం భేటీ అయిన కేజ్రీవాల్ తెలిపారు. అల్లర్లను తగ్గించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారన్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు హింసను అడ్డుకోలేకపోయారని విమర్శించారు. పై నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళన కారులపైకి భాష్పవాయువు ప్రయోగించాలో, లాఠీచార్చి చేయాలో పోలీసులు తేల్చు కోలేక పోయారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్లే హింసకు పాల్పడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చినందున ఢిల్లీ సరిహద్దును కొంతకాలం మూసి వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos