ముద్ద బంతి విలాపం

ముద్ద బంతి విలాపం

హొసూరు : ముద్దబంతి పూలకు గిరాకీ లేకపోవడంతో రైతులు రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నారు. హొసూరు ప్రాంతంలో రోజా, ముద్ద బంతి తదితర పూలను సాగు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పూలకు గిరాకీ లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల ముద్ద బంతి పూల ధరలు పడిపోవడంతో రైతులు పండించిన పూలను రోడ్డు పక్కన పడేస్తున్నారు. ప్రస్తుతం ముద్దబంతి పూలకు మార్కెట్లో ధర తగ్గిపోవడంతో చేసేదిలేక రైతులు పూలను రోడ్డుపాలు చేస్తున్నారు. లక్షలు వెచ్చించి పండించిన పంటలకు సరైన గిరాకీ లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటకు మద్దతు ధర కల్పించడానికి చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos