బెంగళూరు: చెన్నై నుంచి వచ్చిన 85కిలోల భారీ చేప.. బెంగళూరులో అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరులోని చేపల మార్కెట్లో ఈ భారీ మత్స్యం సందడి చేసింది. ఎలోఫిన్ ట్యూనాగా పేరొందిన.. ఈ చేపకు దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో సైతం భారీ డిమాండ్ ఉంటుంది. మెదడు శక్తిని పెంపొందించే లక్షణాలు ఈ చేపలో ఉంటాయని విశ్వసిస్తుంటారు. కొవ్వు శాతం తక్కువగా ఉండే ఈ ట్యూనా చేప కిలో రూ.500 వరకు పలుకుతుంది. ఎక్కువగా అథ్లెట్లు, క్రీడాకారులు ఈ చేప తినేందుకు ఇష్టపడుతుంటారు.