సూరత్ : గుజరాత్లోని సూరత్ సర్తానా ప్రాంతంలో గల ఓ కోచింగ్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 15 మంది మరణించారు. భవనం రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే తీవ్ర రూపం దాల్చాయని సూరత్ పోలీసు కమిషనర్ తెలిపారు. ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు పైనుంచి కిందకు దూకేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. మంటలను అదుపు చేయడానికి 18 ఫైరింజన్లు పని చేస్తున్నాయి. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.