ఒక పూట భోజనం మానేయండి

ఒక పూట భోజనం మానేయండి

న్యూ ఢిల్లీ:సోమవారం – భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొవిడ్పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని ,వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. లాక్డౌన్తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలపాలని భాజపాఅధ్యుడు నడ్డా కోరారు. పేదలకు అన్నం పెట్టండి కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఆరు గురికి భోజనం అందించాలని కోరారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఒక్కరూ మరో ఇద్దరికి ముసుగుల్ని అందిం చా లన్నారు.

తాజా సమాచారం