ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం..

ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం..

కొద్ది రోజుల క్రితం తహసీల్దార్‌ విజయారెడ్డిని సజీవదహనం చేసిన ఘటన ఇంకా కళ్లముందు మెదులుతున్నా రెవెన్యూ అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.తమ భూ సమస్యలు తీర్చాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు రైతులపై అదే నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తున్నారు.తాజాగా తన భూ సమస్య పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఓ రైతు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది.జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది.తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను శరీరంపై పోసుకున్న రైతు శేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమి సమస్య పరిష్కరించడం లేదని రైతు ఆవేదన చెందాడు. అతడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు నచ్చజెప్పారు

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos