ముంబై : మహారాష్ట్రలోని భండారా జిల్లా మోహ్గావ్కు చెందిన ఓ కుటుంబ సభ్యులు 60 ఏళ్ల పాటు వ్యవసాయం చేసిన రైతు గజానన్ కాలే(80)కు రిటైర్మెంట్ ఇచ్చారు. ఇకపై అతను వ్యవసాయ పనులు చేయడు. గజానన్ కాలే కుటుంబ సభ్యులు అతని రిటైర్మెంట్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతనితో పాటు మరో 10 మంది రైతులను సన్మానించారు. వారినందరినీ ఎడ్లబండిలో కూర్చోబెట్టి ఊరేగించారు. ఈ సందర్భంగా గజానన్ సోదరుడు యశ్వంత్ మాట్లాడుతూ తమది ఉమ్మడి కుటుంబమని, మొత్తం 19 మంది సభ్యులం కలసి ఉంటున్నామని చెప్పారు. గజానన్కు 25 ఎకరాల పొలం ఉందని అన్నారు. అన్నయ్యకు వయసు మీద పడటంతో తాము అతనికి వ్యవసాయ పనుల నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.