26న రాజ్భవన్ ల ముట్టడి

26న రాజ్భవన్ ల ముట్టడి

న్యూ ఢిల్లీ: జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్భవన్లను ముట్టడిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఆ రోజును ‘కేతి బచావో, లోక్తంత్ర బచావో’ (వ్యవసా యాన్ని కాపాడండి- ప్రజాస్వామ్యాన్ని రక్షించండి) దివస్గా జరుపుకుంటామని పేర్కొంది ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రభుత్వం దేశంలో అతంత్యాయిక పరిస్థితి ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు కూడా దాదాపు అంతే ఉన్నాయి. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యన్నిచేపట్టి 7 నెలలు కావస్తోంది. జూన్ 26న కేతి బచావో-లోక్తంత్ర బచావో దివస్ జరుపుతాం. రాజ్భవన్లను ముట్టడిస్తాం’అని ఆల్ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. సాగు చట్టాల రద్దు కోరుతూ రైతులు ఉద్యమం చేపట్టి ఆరు నెలలు గడించింది. ఇప్పటికే ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా వివాదం కొలిక్కి రాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos