ఆ విషయం తెలిసి షాకయ్యాం..

  • In Film
  • August 24, 2019
  • 107 Views
ఆ విషయం తెలిసి షాకయ్యాం..

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్‌ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ,తమిళం,కన్నడం,మలయాళం భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది.అందులో భాగంగా సైరా చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న నటుడు,నిర్మాత ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో సినిమాపై ఫరాన్, రితేష్ తమ అభిప్రాయాలని పంచుకున్నారు. కెజిఎఫ్ తర్వాత మరో సౌత్ ఇండియన్ సినిమా సైరాని రిలీజ్ చేయడానికి కారణం చిత్ర కథే అని ఫరాన్ తెలిపాడు.సిపాయిల తిరుగుబాటు కంటే ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారితో పోరాడారని తెలిసి షాకయ్యాం. నిజంగా ఆయన చరిత్ర గుర్తించని వీరుడు. కథ విన్న మాకే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ ఆడియన్స్ కూడా చిత్రాన్ని ప్రాంతంతో బేధం లేకుండా ఆదరిస్తారని నమ్మకం కలిగినట్లు ఫరాన్ తెలిపాడు.ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. తమకు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పూర్తిగా తెలియదని, చిత్రాన్ని ప్రారంభించే క్రమంలో అనేక విషయాలు తెలుసుకున్నట్లు చిరంజీవి తెలిపారు

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos