జనసేన పార్టీ అధినేత,పవర్స్టార్ పవన్కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు భారీస్థాయిలో పుట్టినరోజు ఏర్పాటు చేస్తున్నారు.అయితే పుట్టినరోజున సుమారు రూ.2వేల కోట్ల నల్లధనాన్ని వైట్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ వినిపిస్తున్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.సెప్టెంబర్2వ తేదీన జరుపుకోనున్న పుట్టినరోజు వేడుకల్లో రూ.2వేల కోట్ల నల్లధనాన్ని వైట్మనీగా మార్చడానికి పవన్కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ స్పందించారు. తమ అధినాయకుడిపై కావాలనే చెడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ ద్వారా ఈ అసత్య ప్రచారం జరుగుతోందని, దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ స్పందిస్తూ… తమ పార్టీపైకానీ, అధ్యక్షుడిపై కానీ ఇలాంటి దుష్ర్పచారం జరిగితే సహించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..