దళిత సర్పంచ్‌పై పెత్తందార్ల దౌర్జన్యం

దళిత సర్పంచ్‌పై పెత్తందార్ల దౌర్జన్యం

శింగనమల: అనంతపురం జిల్లా కల్లుమడిలో పెత్తందారులు తమ దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. బుధవారం ఉదయం గ్రామంలోని రాజకీయ నేతలు, పెత్తందారులు కలిసి నూతన సర్పంచ్గా బాధ్యతలను చేపట్టిన దళిత సర్పంచ్ను కార్యాలయంలోనికి వెళ్లనీయకుండా అడ్డుపడ్డారు. దీంతో దళిత సర్పంచ్ కార్యాలయం బయటే బైఠాయించి నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసిపి రెబల్ అభ్యర్థిగా గెలుపొందిన దళిత పక్కీరమ్మ… నూతన సర్పంచ్గా పదవి బాధ్యతలను స్వీకరించారు. నూతన సర్పంచ్ వచ్చినప్పటికీ స్థానిక వైసిపి మాజీ సర్పంచ్ సౌభాగ్యమ్మ పెత్తనం కొనసాగిస్తున్నారు. పక్కిరమ్మకు బాధ్యతలను అప్పగించేందుకు పెత్తందారులు అంగీక రించడం లేదు. ఈ రోజు పెత్తందారులంతా నూతన సర్పంచ్ను కలిసి కార్యాలయంలోకి అనుమతించకుండా తాళం వేశారు. దీంతో సర్పంచ్ పక్కీరమ్మ కార్యాలయం బయటే కూర్చున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos