ఫహీమ్ ముఠా పట్టివేత

ఫహీమ్ ముఠా పట్టివేత

హైదరాబాదు: ఉత్తరప్రదేశ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఫహీమ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని నగర పోలీసు కమిషనరు సజ్జనార్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ‘ఫహీమ్ బృందం హైదరాబాద్ లోని మేడ్చల్, అల్వాల్ తదితర ప్రాంతాల్లోనూ దొంగతనాలు చేసారు. ఫహీమ్ తో పాటు అతని ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మొరాదాబాద్ జిల్లాకు చెందిన గ్లాస్ కటింగ్ పని చేసే ఫహీమ్, 2013లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయి మురాదాబాద్ జైలుకు వెళ్లాడు. అక్కడ అతనికి మహమ్మద్ ముర్సలిమ్ తో స్నేహం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరూ కలిసి గురుగ్రామ్ లో తమకు తెలిసిన వ్యాపారాన్నే ప్రారంభించారు. అయితే, తమ విలాసాలకు కావాల్సినంత ఆదాయం రాకపోడవంతో దోపిడీలకు తెర లేపారు. వారితో ముర్సలిమ్ స్నేహితుడు ఆరిఫ్ కూడా చేతుల కలిపాడు. గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, ఏపీల్లో పలు చోరీలు చేశాడు. దాదాపు 100 చోరీల్లో నిందితుడు. పలు రాష్ట్రాల్లో ఫహీమ్ పై కేసులున్నాయి. తరచూ నివాసాలు మార్చుతూ ఉండటంతో ఎక్కడా పట్టుబడ లేదు. దొంగిలించిన బంగారాన్ని బిస్కెట్లుగా మార్చి అమ్మేవాడు. ఈ నెల 4వ తేదీన మేడ్చల్, ఆల్వాల్ పరిధిలో రెక్కీ నిర్వహించి తమ దొంగతనాల్ని కొనసాగించారు. కర్ణాటకలో కొన్ని దొంగతనాలు చేసి, గురుగ్రామ్ చేరుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రానికి చెందిన కార్ నంబర్ ను తమ వాహనానికి అమర్చి పోలీసులకు అనుమానం రాకుండా వ్యవహరించారు. హైదరాబాద్ లో దొంగతనాలు చేసిన ప్రాంతాల్లో లభించిన శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరి గత నేరాల గురించి సైబరాబాద్ పోలీసులకు ఉప్పందింది. దీంతో ఎఓటీ ఇనస్పెక్టర్ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం యూపీకి వెళ్లింది. అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ఫహీమ్ తో పాటు ముర్సలీమ్ లను అరెస్ట్ చేసింది. గురుగ్రామ్ ప్రాంతంలోని ఒక విలాస భవవంతిలో తలదాచుకున్న వారిని అదుపులోకి తీసుకున్నామ’ని విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos