శవాగారంలో మృతదేహంలో కళ్లు మాయమవడం పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా నగరంలో చర్చనీయాంశమైంది. కోల్కతాకు చెందిన శంభునాథ్ దాస్ గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు.మృతదేహం పంచనామా కోసం శంబునాథ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పంచనామా పూర్తి కావడంతో మృతదేహాన్ని కుటుంబసబ్యులకు అప్పగించారు. అయితే… శంభునాథ్ శవానికి కళ్లు లేకుండా ఉండటాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు.వెంటనే ఈ విషయం గురించి హాస్పటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అందుకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. కళ్లను ఎలకలు తినేశాయంటూ సమాధానం చెప్పడంతో శంభునాథ్ కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ శుంభునాథ్ కొడుకు సుశాంత ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు దర్యాప్తు చేపట్టారు..