దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ ఘటన చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ రాజ్యాంగ వ్యతిరేకమంటూ కొంత మంది మేధావులు విమర్శలు చేస్తుండగా ఎన్ కౌంటర్ పై జాతీయ మానవహక్కుల సంఘం విచారణ కూడా జరుపుతోంది.ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాదుకు చెందిన ‘నేను సైతం‘ స్వచ్చంద సంస్థ ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారని… ఈ ఘటనలో సజ్జనార్ తో పాటు నలుగురు పోలీసు అధికారులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ కోరారు. కాగా ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.ఇదిలా ఉండగా నిందితుల ఎన్కౌంటర్పై విమర్శలు చేస్తున్నవారి కంటే హర్షం వ్యక్తం చేస్తున్న వారి సంఖ్యే రోజురోజుకు పెరుగుతుండడం గమనార్హం..