అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ఇక్కడ సమీక్షించారు. విద్యాశాఖ మంత్రి, అధికారులకు జగన్ పలు సలహాలు, సూచనల్ని చేసారు. ‘నాడు- నేడు’ లో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రయోగ శాలల్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాలని నిర్ణయించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాలని కోరారు.