హొసూరులో ఆక్రమణల తొలగింపు

హొసూరులో ఆక్రమణల తొలగింపు

హొసూరు : హొసూరు కార్పొరేషన్ పరిధిలోని ఆవులపల్లి రోడ్డులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మించుకున్న కట్టడాలను అధికారులు జేసీబీ యంత్రాలతో ధ్వంసం చేశారు.  ఆవులపల్లి రోడ్డు సమీపంలోని పెట్రోలు బంకు వెనుక భాగంలో గల ప్రభుత్వ స్థలంలో కొన్ని కుటుంబాలకు చెందిన వారు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉండేవారు. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని గతంలో అధికారులు హెచ్చరించారు. స్థానికులు పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు జేసీబీ యంత్రాలతో ఆక్రమణలు తొలగించి విలువైన భూమిని స్వాధీనపరుచుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆక్రమణలు తొలగించేందుకు ముమ్మరంగా చర్యలు  చేపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos