జమ్ము: శ్రీనగర్లోని పంథా చౌక్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరిని సుహేల్ అహ్మద్గా గుర్తించారు. అతనికి జైషే మహ్మద్తో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.