హైదరాబాద్:కేసీఆర్తో పాటు సీపీఐపై ఈటల చేసిన వ్యాఖ్యాల్నినిరాధారమైనవిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కొట్టిపారేశారు. టీఆర్ఎస్తో తమకు లోపాయికారీ ఒప్పందం ఉంటే ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లౌకికవాదినని చెప్పకుంటున్న ఈటల మతతత్వ బీజేపీలో ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించారు. రాజేందర్ తన స్థాయిని దిగజార్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలపడితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. అస్తెన్డ్ దేవాలయ భూములు ఎవరు కొన్నా తప్పేనని, తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని లేకపోతే మళ్లీ భూ పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.