ముంబై: అంతర్జాతీయ విపణిలో సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ ధరలు తగ్గు ముఖం పట్టటంతో దేశీయ విపణిలో లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు తగ్గ వచ్చని విపణి వర్గాలు తెలిపాయి. గత మేలో వంట నూనెల వర్గంలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. వంట నూనెలో సగానికి పైగా దిగుమతి చేసుకుం టున్నాం. దీంతో కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం పామాయిల్పై లీటరుకు రూ.7-8, సన్ఫ్లవర్ ఆయిల్పై రూ.10-15, సోయాబీన్పై రూ.5 వంతున ధరలు తగ్గే అవకాశం ఉంది.