డ్వాక్రా మహిళలకు పెద్ద వరం

డ్వాక్రా మహిళలకు పెద్ద వరం

డ్వాక్రా మహిళలకు శుభవార్త. ఒక్కో మహిళకు రూ.10 వేలతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈనెల 26న విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు ఇందుకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇదివరకు 2014 ఏప్రిల్‌కు ముందు ఏర్పాటైన సంఘాల సభ్యులకు చంద్రన్న పసుపు, కుంకుమ కింద నాలుగు విడతల్లో రూ.10 వేలు చొప్పున జిల్లాలోని 5.32 లక్షల మందికి రూ.532 కోట్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 63 మండల సమాఖ్యలు, 2,858 గ్రామైక్య సంఘాలు, 56,036 స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 5.82 లక్షల మంది డ్వాక్రామహిళలు సభ్యులుగా ఉన్నారు. తాజా నిర్ణయం మేరకు అన్ని సంఘాల సభ్యులకు మరోసారి రూ.10వేలతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆ శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ లెక్కన జిల్లాలోని సభ్యులందరికీ రూ.582 కోట్లు జమ చేయనున్నారు. అయితే ఒకేసారి ఆ మొత్తం ఇస్తారా..? విడతలవారీగా ఇస్తారా..? అనేది తెలియాల్సిఉంది. స్మార్ట్‌‌ఫోన్‌ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు రీచార్జి కూడా చేయించాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos