ఎంత నీచానికి దిగజారారటంటే..

ఎంత నీచానికి దిగజారారటంటే..

ప్రతిరోజూ వందలాది మందిని బలి తీసుకుంటూ కరోనా ప్రపంచ దేశాలకు పాకుతూ మరణశాసనం లిఖిస్తుంటే కొంతమంది నీచులు మాత్రం కరోనా భయాన్ని సొమ్ము చేసుకోవడానికి మరింత నీచానికి దిగజారారు.ఓపక్క కరోనాకు మందుల్లేక కిందా మీదా పడుతూ వేలాదిగా చస్తూ.. లక్షలాదిగా దాని బారిన పడి నరకయాతన పడుతుంటే కరోనాకు మందు తమ వద్ద ఉందంటూ కలర్ ఫుల్ బోర్డులు పెట్టే తీరు చూస్తే.. శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అప్రయత్నంగా గుర్తుకు రాక మానదు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని బోర్డులు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధిని నయం చేసే మందులు తమ వద్ద ఉన్నట్లుగా కొన్ని వైద్య మెడికల్ షాపులు బరితెగించి మరీ బోర్డులు పెట్టేస్తున్నాయి. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు డాక్టర్స్ హోమియోపతి మందు తమ వద్ద లభిస్తుందని పేర్కొంటున్నారు. ఇలా సందులో బోర్డు పెట్టుకునే బదులు.. వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కరి అయ్యే దేశాలకు తమ వద్ద ఉన్న మందుల్ని పంపితే.. పిట్టల్లా రాలిపోతున్న చాలామందికి ప్రాణాలు పోసినోళ్లు అవుతారు కదా? సమయాన్ని చూసుకొని.. సొమ్ము చేసుకునే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిని లోపలేయాల్సిన అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనాకు హోమియో మందు ఉందని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos