అంతరిక్షంలో అనారోగ్యం.. భూమి నుంచే వైద్యం..

అంతరిక్షంలో అనారోగ్యం.. భూమి నుంచే వైద్యం..

పరిశోధనల్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామికి భూమిపై నుంచే వైద్యం అందించిన అరుదైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన వ్యోమగామి మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టింది. సమస్యను పరిష్కరించేందుకు తరహా సమస్యలకు వైద్యం చేసే నిపుణుడైన ప్రొఫెసర్ స్టీఫన్ మోల్ సాయంతో వైద్యం చేయించారు.అప్పటికప్పుడు చికిత్సకు అవసరమయ్యే మందుల్ని పంపే అవకాశం లేకపోవటంతో.. తొలుత భూమి మీద నుంచి వైద్యాన్ని షురూ చేశారు. మొయిల్స్ ద్వారా సమాచారం పంపుతూ వైద్యం చేయసాగారు.రక్తం గడ్డ కట్టకుండా చూసేందుకు ప్రత్యేక మందును ఇంజెక్షన్ ద్వారా తీసుకునేవారు. 40 రోజుల పాటు వైద్యం సాగుతుండగా ప్రత్యేక రాకెట్ ద్వారా వాడాల్సిన మందుల్ని పంపారు. ఇలా మొత్తం మూడు నెలల పాటు వైద్యం సాగింది. మొత్తంగా ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉండాల్సి ఉండగా.. నాలుగు నెలల పాటు వైద్యం సాగింది. అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చే నాలుగు రోజుల ముందు చికిత్సను నిలిపివేశారు. భూమ్మీదకు వచ్చేసరికి తదుపరి చికిత్స అవసరం లేకుండానే వ్యాధి నయమైందని చెబుతున్నారు. తరహాలో వైద్యం చేయటం ఇదే తొలిసారి కావటం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos