అంబులెన్స్‌కు దారి ఇవ్వొద్దు..

అంబులెన్స్‌కు దారి ఇవ్వొద్దు..

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి బీజేపీ నిర్వహించిన ర్యాలీలో బీజేపీ నేత వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా తాజగా పశ్చిమ బెంగాల్లోని నదియాలో భారతీయ జనతా పార్టీ నిన్న సభను నిర్వహించింది. బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ఘోష్‌  ర్యాలీలో ప్రసంగిస్తూ అంబులెన్సుకు దారి ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు.ర్యాలీ నేపథ్యంలో రహదారిపై బీజేపీ కార్యకర్తలు  వందల సంఖ్యలో ఉండగా అంబులెన్స్వచ్చింది. దీంతో అంబులెన్స్కు దారి ఇవ్వొద్దని దిలీప్ ఘోష్ కార్యకర్తలకు సూచించి, దాన్ని వెనక్కి తిప్పి పంపండని ఆదేశించారు. తమ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకే తృణమూల్కాంగ్రెస్ అంబులెన్స్ను పంపిందని అంబులెన్స్‌కు దారి ఇవ్వొద్దని ఆదేశించారు.ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దిలీప్‌ ఘోష్‌పై సర్వత్రా విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos