పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి బీజేపీ నిర్వహించిన ర్యాలీలో బీజేపీ నేత వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా తాజగా పశ్చిమ బెంగాల్లోని నదియాలో భారతీయ జనతా పార్టీ నిన్న ఓ సభను నిర్వహించింది. బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ర్యాలీలో ప్రసంగిస్తూ అంబులెన్సుకు దారి ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు.ర్యాలీ నేపథ్యంలో రహదారిపై బీజేపీ కార్యకర్తలు వందల సంఖ్యలో ఉండగా ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో ఆ అంబులెన్స్కు దారి ఇవ్వొద్దని దిలీప్ ఘోష్ కార్యకర్తలకు సూచించి, దాన్ని వెనక్కి తిప్పి పంపండని ఆదేశించారు. తమ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకే తృణమూల్ కాంగ్రెస్ ఆ అంబులెన్స్ను పంపిందని అంబులెన్స్కు దారి ఇవ్వొద్దని ఆదేశించారు.ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో దిలీప్ ఘోష్పై సర్వత్రా విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..
#WATCH West Bengal: State BJP chief Dilip Ghosh orders to divert route of ambulance during an event in Nadia; says, "divert the route of ambulance as hundreds of people are sitting here. They (TMC) are doing it purposely. It's their tactic to disrupt this rally." (06.01.2020) pic.twitter.com/SALCvph6QQ
— ANI (@ANI) January 8, 2020