చెన్నై : తమిళనాడులోని వేలూరు లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలో డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ విజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి షణ్ముగంపై ఆయన ఎనిమిది వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఈ స్థానానికి గత ఏప్రిల్ 18న ఎన్నిక జరగాల్సి ఉండగా, పెద్ద ఎత్తున డబ్బు బయటపడడంతో కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ నెల 5న ఎన్నికను నిర్వహించగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 28 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే జరిగింది.