హొసూరులో డీఎంకే నాయకుని దారుణ హత్య

హొసూరులో డీఎంకే నాయకుని దారుణ హత్య

హొసూరు : పాత కక్షల కారణంగా డీఎంకే ప్రముఖుని ఆదివారం రాత్రి దారుణంగా నరికి హత్య చేశారు. హొసూరు ఇమాంబడాకు చెందిన మన్సూర్ అలీ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. హొసూరు కామరాజు కాలనీలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో వాకింగ్ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయనను చూసిన స్థానికులు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందారు. ఈ హత్య పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది. హంతకుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos